అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

21 Apr 2016

లౌకికస్వాప్నికుడు



యాకూబ్....మగ్ధుం,కాళోజీ వంటి కవులు నిర్మించిన కవిత్వ వంతెనమీద నడుస్తున్న కవి మానవ సంబంధాలను మార్కెట్ శాసిస్తున్న సంక్షుభిత కాలంలో మతం గీసిన సరిహద్దు రేఖల్ని ద్వంసం చేయాలని ఒక లౌకికస్వప్నాన్ని స్వప్నిస్తూ పట్టణ నాగరికత లోని మానసిక ఉక్కపోతను తట్టుకోలేక భౌతికఘర్షణలు వదిలి ఇంటికోసం పరుగెడుతాడు. నదీమూలంలాంటి ఆ ఇల్లు కవితాసంపుటి తెలంగాణ ఆవిర్భవించిన సందర్భంలో రావడం ఒక చారిత్రక విశేషం దళిత ముస్లింగా తనను తాను తెలుసుకొని గ్రామాలను,చెఱువులను,జన్మనిచ్చిన తల్లిదండ్రులను కవితామయం చేశాడు.ప్రాచీన కవిత్వంలో కనిపించని సంఘర్షణ,ఉద్యమస్పూర్తి,స్త్రీలను గౌరవించే ఉన్నత సంస్కృతి కవిత్వంలో చోటుచేసుకుంది ఫాసిజం అంటే గిట్టదు పదహారణాల ప్రగతిశీల కవి భిన్నభాషా సంస్కృతులతో పరిచయం విభిన్న వ్యక్తిత్వాలతో మమేకమవ్వడం జన్మతః లభించిన వరం.
సూఫీతత్వ మార్గంలో పయనిస్తూ....కవితలన్నీ మానవీకరణ పొందిన అనుభూతి వాహికలు సాటి మనిషి ఆవేదన పట్టించుకోని ప్రపంచాన్ని కవిత్వం ద్వారా నిలదీసిన కవి ఇన్ఫర్మేటివ్ కవిగానే కాక ఈస్థటిక్ కవిగా కనిపిస్తాడు కలవరపెట్టే కలలతో కాలాన్ని వ్యయంచేసేభావుకుడు మాత్రమేకాదు అన్నంపెట్టిన అమ్మను గౌరవించి ముద్దాడటం తెలిసినకవి కొదరికి మనుష్య భాష మాత్రమే పరిచయం కానీ చినుకు భాష తెలిసిన ముసురు కవి హృదయం ద్రవించడం తెలుసు కాబట్టి ఊపిరాడదు అనే కవితలో ''ఓ కవిమిత్రుని తడిఆరని అక్షరాలని ఆప్యాయంగా స్పృశించాను''అంటాడు. కవి మనల్ని బలవంతుల్ని చేసే కవితలల్లుతాడు తనమీద తనకు నమ్మకముండాలని ఎప్పటిలాగే నడిస్తే దారేకాదు గమ్యంకూడా దొరుకుతుందని''ఛల్తేరహో! కవిత చెప్తుంది.  అవ్యాజమైన ప్రాంతీయాభిమానానికి మాఊరు తెలంగాణా కవిత చక్కని నిదర్శనం అస్థిత్వం కోసం తానెంత కష్టపడ్డాడో తనకు ప్రాంతానికి ఉద్యమానికి అబేధాన్ని ప్రకటించాడు.జివీతంలో ఎన్నోఎత్తుపల్లాలను నేలమీది పరిస్థితులను తరగతిగదుల్లో తారుమారవుతున్న ఆసక్తులను గుర్తుచేస్తాడు ఎవ్వరిని పరుషంగా దూషించక ''వంచనను స్నేహానికి మరోముఖమని వారు తేల్చేశారు'' అని సాధించిన దానిని బాగుచేయక తప్పదు.  ''తుప్పుపట్టిన లోపలిని మళ్ళీసరికోత్తధిగా మార్చాలి'' అని మనోభావాన్ని తెలిపాడు.
ఒలికిన పద్యమనే కవితలో.....పద్యాన్ని జీవితాన్ని సమన్వయపరుస్తూ తెలిపిన భావాలుఅద్భుతమైనవి ''కల్లుమూసి తెరిస్తే నువ్వోపద్యం'' జీవితయాత్రలో చివరిమజిలీగా వ్యక్తమవుతుంది ''నదీమూలంలాంటి ఆ ఇల్లు'' కవిత కేవలం అనుభూతి మాత్రమేకాదు చిరకాల జ్ఞాపకసిక్తమై సంఘర్షించిన బాల్యంతో సంయుక్తమై కనిపిస్తుంది. ఏ ఇంటితో సంబంధం లేకున్నా వెళ్ళడం మనిషికి మర్యాదగా మారింది.కానీ....పుట్టినిల్లు,గడప,ద్వారం,కిటికీలు,దూలాలు,ఇంటిముందు వేపచెట్టు మరువలేని నిజాలు.ఏ ఇజాలకు కట్టుబడని జీవితసత్యాలు! తన బాల్యానికి గోపురమై నిలిచిన జీవధార లాంటి ఇల్లంటే ఎంతో ప్రేమ ''అంతేలేనిజ్ఞాపకం''ఇల్లంటే చిన్నప్పటినుంచి నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం!ఈవాక్యం చాలు కావ్యం కావడానికి [వాక్యంరసాత్మకం కావ్యం] ''అక్కడ ఒక జీవితం ఉంది''జీవితపయనంలో ఎన్నో లోయలు,శిఖరాలు ఉన్నాయని స్పురింపచేస్తుంది. ''చెల్లెలిఫోన్'' కుటుంబ ధర్మాన్నిగుర్తుచేస్తుంది లోపలిపరుగు ఆదివారానికి సంకేతమయ్యింది
తరతరాలకు అక్షరాలకు దూరంగాఉన్న మనుషుల జీవితాల్లో వెలుగునింపే ''పాఠంలధ్వని''గర్భితమైన కవిత అధ్యయనం,అనుశీలనం,ఆక్రోశం,ఆవేశం ఉంటేకానీ ''బొటనవ్రేలుల్నినరికేసినా కొత్తగామొలవని కాలంపోయింది'' అంటూ ప్రతిసృష్టి చేసే ఏకలవ్యులు పుట్టుకోస్తారనే సందేశాన్నిస్తుంది.మనిషిలో అంతర్గతంగా అద్భుతమైన విద్యదాగివుందని మొదళ్ళు పీకేసినా సరికొత్తగా మొలుచుకొచ్చే విద్యనేర్చుకునే పుట్టాము అనే కవితలో కనిపిస్తుంది వానజల్లుల తర్వాత వాగుముఖంలో నీటినవ్వును గమనించిన కవి కృష్ణా,గోదావరులు కరుణించకపోయినా తనకు తెలిసిన నల్లవాగే వాటితో సమానమని భావించినప్పుడు సామన్యునికి ఎంతసంతృప్తి కలుగుతుందో తనఊరు గొంతును తడిపే వాగును వర్ణించి దేశీ కవిగా నిలుస్తాడు. దిల్షుక్నగర్ ప్రదేశాన్ని ''బాంబులమధ్య వణుకుతున్న బెదురుచూపుల లేగదూడ'' అన్నాడు. ''ఇప్పుడొక బతుకువిద్వంసాన్ని కూర్చిపేర్చిన ప్రతీకలకూడలి''అంటూ నినదిస్తాడు.పోరాటకవిలో భావకవి ఉంటాడు ప్రేమ ఒక ఉనికి అనే కవితలో ''తెల్ల తెల్లని సంతోషంలాంటిపాట'' అంటూ పాడుకోవడం కవికి అలవాటు!
జీవితాన్ని జ్ఞాపకాల పెట్టెగా బతుకు కథగా భావించి ''అత్మనంతా ఒకచోటకుచేర్చి ఒంపుతాను''అంటూ ఎదిగాడు సంధిగ్ధ ప్రపంచంలో ఉద్విగ్నగళంతో ''నాపేరు ఒకప్రశ్న నావూరు ఒకప్రశ్న'' అని చిరునామాను గుర్తుచేసుకుంటాడు జీవితాన్ని ''నీడలు''గా భావించి ''అక్షరాన్నినమ్ము''కున్నాడు. ''కవిసమయం''ను గుర్తించి కవితాసంగమంలో జీవించాడు. ఎనిమిదిపాదాల పలుకులు మర్చిపోలేము! విత్తనమేస్తే వనమయ్యింది! పిల్లనగ్రోవినిస్తే సంగీతమైనది!పదాలు వెదజల్లితే జీవితమైంది!స్వార్థం లేని కవి ''రేపు నన్నేయిస్తానుఅక్కడ కవిత్వం విస్తరించాలి'' అంటున్న కవిసంగమం యాకుబ్ గారికి అభినందనలు.
[ కవి యాకూబ్ ఇస్మాయిల్ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా...]

~నిర్మలనందిగామNovember 29, 2015

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...