అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

24 Apr 2016

యాకూబ్ గ్రంథాలయం నేటి సమాజానికి స్ఫూర్తి

తెలంగాణ సాధనలో కళాకారులే ప్రేరక శక్తులు


-యాకూబ్ గ్రంథాలయం నేటి సమాజానికి స్ఫూర్తి 
-చిరస్మరణ నా గమనాన్నే మార్చింది.. రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి

కారేపల్లి రూరల్: రాష్ట్ర సాధనలో కళాకారులే ప్రేరక శక్తులని, తెలంగాణను సాధించి పెట్టిన రాజకీయ పార్టీలు కారక శక్తులుగా నిలిచాయని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రొట్టమాకురేవులో కవి యాకూబ్ ఏర్పాటు చేసిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉద్యమం సందర్భంగా పుట్టినన్ని పాటలు ప్రపంచంలో ఏ సాహిత్య ఉద్యమంలోనూ రాసిఉండరన్నారు.

గళం విప్పి గర్జించిన కళాకారులు ఉద్యమానికి ఉత్ప్రేరకాలుగా నిలిచారని, స్వరాష్ట్రంలోనూ గళాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తూ సాహిత్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పల్లె ఉత్సవమే రొట్టమాకురేవు కవిత్వ అవార్డు అని అభివర్ణించారు. కవి యాకూబ్ తన స్వగ్రామమైన రొట్టమాకురేవులో ఏర్పాటు చేసిన గ్రంథాలయం నేటి సమాజానికి స్ఫూర్తి అని, ఒక పుస్తకం తన జీవి త గమనాన్ని ఎలామార్చిందో ఉదహరించారు. కేరళ రాష్ట్రం మలబారు ప్రాంతంలో కుగ్రామమైన కయ్యూరు ప్రజల కష్టాలు, కన్నీళ్ల గాథలపై చిరస్మరణ పేరుతో పుస్త కం వెలువడిందని చెప్పారు. పుస్తకాన్ని చదివిన తనను ఆ గ్రామంలో సామాన్యులు ఉద్యమించిన తీరు తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. వామపక్ష ఉద్యమాల వైపు, సమాజాన్ని చదవడం వైపు అడుగులు వేయించిందని విశ్లేషించారు. ఇలాగే రొట్టమాకురేవులోని గ్రంథాలయం కూడా ప్రజల్లో మార్పు తేవాలని ఆకాంక్షించారు. యాకూబ్ ప్రయత్నానికి సహకారంగా తన వంతుగా వంద పుస్తకాలను గ్రంథాలయానికి అందజేస్తానని ప్రకటించారు.

ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అమోఘం: రసమయి
రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని, ఉద్యమానికి దశ, దిశ చూపించిన ఘనత వారిదేనని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రశంసించారు. ప్రతి వ్యక్తికి ఒక ఊరు ఉండాలి.. పలకరించే మనిషి ఉండాలని, అలాంటి ఊరు, ఆప్యాయంగా పలకరించే మనుషులను పొం దిన మహనీయుడు యాకూబ్ అని ప్రశంసించారు. పల్లె మూలాలను ప్రపంచానికి చాటిన యాకూబ్, నేటి సమాజంలో మార్గదర్శి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తర్వాత ఇక్కడి చెట్ల గాలి రచయిత నందిని సిధారెడ్డి, జీరో డిగ్రీ రచయిత మోహన్‌రుషి, సంచిలో దీపం రచయిత హిమజలతోపాటు ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌లకు అవార్డులు ప్రదానం చేశారు. కవి, సీనియర్ జర్నలిస్టు ప్రసేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్, కాసుల ప్రతాపరెడ్డి, పోతినేని సుదర్శన్, పోటు రంగారావు, సాధిక్ అలీ, దాసరి అమరేంద్ర, కొండపల్లి ఉత్తమ్‌కుమార్, ఆనంద్, సామినేని రాఘవులు, వాసిరెడ్డి రమేశ్‌బాబు, కవి యాకూబ్, డాక్టర్ సీతారాం, వంశీకృష్ణ, సత్య శ్రీనివాస్, డాక్టర్ రమణ ప్రసంగించారు.


source - https://www.facebook.com/trsadithyak/photos/a.413524395492249.1073741828.413496642161691/499157553595599/?type=3&theater

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...