అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

22 Aug 2013

కవిసంగమం-Facebook Poetry Group



2013 లో ఇప్పటివరకూ ఎనిమిది 'కవిసంగమం' కార్యక్రమాలు ప్రతినెలా రెండవ శనివారం జరిగాయి.
ఈ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' కవిసంగమం కార్యక్రమంలో ఐదుగురు చొప్పున కవులు కవిత్వం విన్పించారు.

1. ఒక ప్రముఖ కవి.
2.ఇదివరకే కవిగా గుర్తింపు పొంది, 'కవిసంగమం'లోనూ రాస్తున్న కవి.
3.ముగ్గురు ప్రవర్థమాన కవులు.

ఈ సంరంభంలో పాల్గొన్న కవులు ~

వేదిక :లామకాన్ 
....................
జనవరి 27- నగ్నముని | వసీరా | కిరణ్ గాలి,మెర్సీ మార్గరెట్,చింతం ప్రవీణ్ .
ఫిబ్రవరి 9 - నిఖిలేశ్వర్ | పులిపాటి గురుస్వామి | నందకిషోర్,జయశ్రీనాయుడు,క్రాంతి శ్రీనివాసరావు
మార్చి 9 - విమల | బివివి ప్రసాద్ | యజ్ఞపాల్ రాజు,శాంతిశ్రీ ,చాంద్ ఉస్మాన్
ఏప్రిల్ 13 -వరవరరావు | కాసుల లింగారెడ్డి | అనిల్ డానీ,మెరాజ్ ఫాతిమా,నరేష్ కుమార్
మే 11 - దేవిప్రియ |కోడూరి విజయకుమార్ |సివి సురేష్,వనజ తాతినేని,బాలు వాకదాని
జూన్ 8 - అమ్మంగి వేణుగోపాల్ | రెడ్డి రామకృష్ణ | మొయిద శ్రీనివాసరావు,రాళ్ళబండి శశిశ్రీ ,తుమ్మా ప్రసాద్

వేదిక : 'గోల్డెన్ త్రెషోల్డ్'
.........................
జూలై 13 - శీలా వీర్రాజు | సత్యశ్రీనివాస్ | లుగేంద్ర పిళ్ళై,సొన్నాయిల కృష్ణవేణి,కృపాకర్ పొనుగోటి
ఆగష్టు 10 - ఇంద్రగంటి శ్రీకాంతశర్మ |దాసరాజు రామారావు |కాశిరాజు,పూర్ణిమా సిరి,శ్రీకాంత్ కాన్టేకర్

ఈ వరసలో ఈ సంవత్సరంలో ఇంకా మిగిలిన కార్యక్రమాలు :
సెప్టెంబర్ 14 -
అక్టోబర్ 12 -
నవంబర్ 9 -
డిసెంబర్ 14 -K_A_V_I_S_A_N_G_A_M_A_M P.O.E.T.R.Y F.E.S.T.I.V.A.L.



ఏదో మిగిలే ఉంది !


లోపల ఇంకా ఏదో మిగిలే ఉంది.స్థిరంగా ఉంది.తడిగా ఉంది.రక్తమంటి జిగట జిగటగా ఉంది.
చేతికి అంటిన అన్నంమెతుకుల ఎంగిలిలా ఉంది.కడిగిన చేతివేళ్ళ మధ్య దాగిన కారపుమరకలా ఉంది.

ఏదో మిగిలే ఉంది.

ఒంటరిగా వొంటరి ఒంటరివై వొంటరి 
వొంటరితనంతో కసిగా రక్కేస్తున్న -ఒంటరి.

నిజమో కాదో తెలియక ,మిగిలిందే చివరిదని,చివరికి మిగిలిందేనని
నమ్ముతూ రోజుల్ని అమ్ముతూ పగళ్ళూ రాత్రుళ్ళూపొర్లుతూ దొర్లుతూ
ఎంతో మిగిలిపోతూ, మిగిలినదేదో తెలియని
ఏదో మిగిలే ఉంది.

లోపల దాచిన అసలు రహాస్యమే నువ్వు
బయటికి కన్పిస్తున్నది అసలు నువ్వేకాదు.

అసలు ఏం చెబుతావో
మాటలేవీ మాటలే కావు.
ముఖం దాచుకోవాల్సిరావడం
ముఖంపై నిజాల్ని తొడుక్కోలేకపోవడం ఇవాల్టి పదచిత్రం.

నిజమేనేమో- ఇలా తవ్విపోస్తున్నది ఈ మెట్రో రైలు గుంతలని కానేకాదు
నగరం నడిబొడ్డు మీద నిన్నే నిన్నే నిన్నే....!!

#15.8.2013

కలవంటి మరణం

త్రిశ్రీ చనిపోయాక నివాళిగా ఒక కవిత 10.11.96 లో రాసాను. నా 'సరిహద్దు రేఖ'[పుట .78,79]లో ప్రచురించాను.


....................

చెట్లు ఎండిన అశ్రువుల్ని రాల్చాయి
మేఘం ఇది చూసి కలవరపడి ఉంటుంది 
మరణాన్నే బహుశా ఇది సంశయానికి గురిచేసి ఉంటుంది.

కలవంటి మరణం 
మరణం వంటి కల 
కలకూ,జీవితానికీ చివరికంటా తెగని ప్రశ్న 

తల పగిలి కలలన్నీ భళ్ళున రాలి చెల్లచెదురై పోయుంటాయి 
కాగితాలకేత్తేవాళ్ళెవరూ ఆ దారిలో సంచరించి ఉండరు.

అక్షరాలవంటి జ్ఞాపకాలు 
జ్ఞాపకాలవంటి అక్షరాలు 

అక్షరాలే ఇప్పుడు ఇక అతడి రూపం 
వర్షంలా,రోడ్డులా,నీడలా మరణమే ఇక అతని వెంట నడుస్తుంది 

1

అన్నిటికీ మించి జీవించడమే గొప్ప వరం 
అన్ని రహాస్యాలు అక్కడే దాగి ఉంటాయి 
దేహం రహస్యాల ఖని 
లోపల తవ్వుకుని,అక్షరాలుగా రాసిపోసేందుకే 
ఎప్పటికప్పుడు శ్రమించాలి ,అవైనా మరణాన్ని జయిస్తాయి.

కలల్ని జయించేందుకే అతడు జీవించాడు 
కలలే అతడిని ఇంకా బతికిస్తాయి 
కలల్ని కనే వాళ్లందరూ చిరంజీవులు ,అతని కలల్లో మచ్చుకి ఒకటి :
"వస్తూనే అనుకున్నాను కొత్తగా వద్దు 
పాతగానే మాట్లాడుదామని 
కొన్ని కొత్త సంగతులను 
పాతగా చెబితేనే కొత్తగా అర్థమవుతాయి"

మరణాన్ని కలగా మార్చినవాడు 
స్వప్నాలకు గజ్జెలు కట్టినవాడు
'హో' అన్నవాడు,రహాస్యోద్యమకారుడు ,అక్షరాలకు ఆగ్రహం నేర్పినవాడు,దళితవాదం 
సంధించినవాడు,'కవిత్వం ప్రచురణ'య్యినవాడు 
'యికలేడు' అని అంత తొందరగా తేల్చవద్దు! 

అతడిది 
"ఒక ప్రారంభం కోసం 
ఒక ముగింపు నిరీక్షణ"

[త్రిపురనేని శ్రీనివాస్ జ్ఞాపకానికి]

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...