అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

20 Apr 2016

కవిసంగమం ఒక జీవన్మది



-జి.సత్యశ్రీనివాస్

21వ శతాబ్ధo   అచేతన కళా ప్రపంచంతో మొదలైంది. అంతటా అన్ రియల్ వరల్డ్ ఎస్టేట్లు ఏర్పడ్డ కాలం. నేలంతా ఒక పెద్ద రూపాయి కాగితాల మూట. కళలకు  కాలం చెల్లాయని  అనుకుంటున్న  రోజులు. కవిత్వం  వినడానికి ఎవ్వరికి తీరికలేదు. రాసుకొని  జేబులో మడిచి పెట్టుకోవాలి. తర్వాత సాంకేతిక పరిజ్ఞానం మనుషుల్ని కలిపేందుకు అంతర్జాలంలో ఓ ముఖపుస్తకం తెరిచింది. తర్వాత మీ నుదిటి రాతలు మీరే రాస్కోండి అంది. కవులు ఎవరి భావనల్నివాళ్ళ గోడలమీద రాసారు.   తర్వాత ఈ గోడ మీద రాతలన్ని   ఒకటితో  ఒకటి  మాట్లాడుకోవడానికి  నీడను ఏర్పరిచిన  చెట్టు కవిసంగమం.

ఇంకొక రెండు నెలలలో మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. కవిసంగమం ఫేస్ బుక్ గ్రూపులో ౩౦౦౦ పైగా సభ్యులున్నారు.ప్రతి రోజు కవితలు వాలుతు వుంటాయి. అలానే ప్రతిరోజూ ,రోజుకొక అంశానికి సంబంధించిన  వ్యాసాలున్నాయి. ఇప్పుడు కవిసంగమం  కవిత్వానికి  సంబంధించిన గ్రంధాలయం.
9-2-2012  నుండి నేటి వరకు తెలుగు సాహిత్యానికి ఎందరో  నూతన కవుల్ని పరిచయం చేసింది. ఈ నూతన కవుల్ని కేవలం అంతర్జాలం మాధ్యమానికే పరిమితం చేయకుండా  పాత తరానికి కొత్త తరానికి మధ్య కవిత్వ వారధి అయ్యింది. ఈ బాటలో వచనకవిత్వం అనుభందిత అంశాల పై  నిరంతర సంభాషణ కొనసాగుతోంది.అందులో భాగంగా వర్క్ షాపులు కవిత్వానికి సంబంధించిన   సమాచారాన్ని  పంపిణి చేయడం.
ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ 'లర్నింగ్ ఇన్ ప్రాసెస్' మార్గాన్ని  సృష్టించింది. ఇది ఇన్ ప్రాసెస్స్ లర్నింగ్ కూడ.  జరుగుతున్న వాటి నుండి నేర్చుకోవడం ఒకటైతే, నేర్చుకోవడానికి సరైన పధ్ధతిని ఏర్పాటు చేయడం మరొకటి. ఇదంతా    ప్రక్రియలో భాగం.  కవిసంగమం నేర్చుకోవడానికి  శాస్త్రీయ పద్ధతుల్ని ప్రయోగిస్తోంది.  ప్రాసెస్స్ లర్నింగ్ లో నేర్పేవాళ్ళు, నేర్చు కునేవాళ్ళు  ఇద్దరు ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటారు. అప్పుడు తరాల మధ్య వున్న అంతరాలు తొలుగుతాయి.ఇది భాగస్వామ్య పధ్ధతి. కవిసంగమం లోని ప్రాసెస్ లో   వివిధ తరాలకు, పలు శైలి,ప్రత్యేకతలు వున్న కవులు కనపడతారు. అందుకే ఒక పర్టిక్యులర్  సిద్ధాంతానికి, తరానికి లేక కోవకో చెందినది కాదు.  పలు రకాల పక్షులకు ఒక చెట్టు గూడు కవిసంగమం.

Article in Namaste Telangana

*****
2013- kavisangamam poetry festival -Inaugural Session 

ఈ ప్రాసెస్ ఒకలో ఒక  భాగం   2013లో లామఖాన్-నిరాశ్రయుల గూడులో మొదలై, గోల్డెన్ త్రిషోల్డ్ బంగారు గడపలో కొనసాగుతోంది. ఈ బంగారుగడప గాన కోకిల,కవయిత్రి సరోజినినాయిడు ఇల్లు.కేవలం హైదరాబాద్ కే   కాక తెలంగాణాలోనే ప్రత్యెక స్ధానమున్న ప్రదేశం. విశ్వవిద్యాలయాలలో సాహిత్యం పై చదువులుంటాయి కాని, కవిత్వం ఎలా రాయాలి అన్న పాఠాలు వుండవు. కవిసంగమం హైదరాబాద్ విశ్వవిద్యాలయం గడపలో మూడుతరాల కవులతో ప్రతి నెలా అయిదుగురు కవులుతో ఆ పాఠాల్ని నేర్చుకుందుకు కొత్త ఒరవడి సృష్టించింది. 

మూడుతరాల   వారి వారి కవితల్ని అందరి సమక్షంలో చదివేందుకు వేదికైయ్యింది. ఈ వేదిక  ఉద్దేశ్యం కొత్త తరం పాత తరం నుండి నేర్చుకోవడం. వాస్తవానికి కవిత్వానికి తరాలతో గొడవ వుండదు.  ఈ వేదిక తరం మధ్య వుండే గోడను పగలగొట్టే ప్రయత్నం. కళాకారుడికి,కవికి స్కిల్ తో బాటు క్రాఫ్ట్మెన్షిప్ అవసరం. అది ఈ ప్రక్రియలో జరుగుతోంది. ఏ కళలోనైనా ఏది అనవసరం అని తెలిస్తే రూపం దాననంతట అదే ఆవిష్కరిస్తుంది. ఇలా జరగడానికి కళాకారుడు నిరంతర శ్రామికుడు ,పరిశోధకుడు, అన్వేషి అవ్వాలి. అవన్నీ  ఈ ప్రక్రియలో ఇమిడి వున్నాయి. అందుకే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు  గోడలలో పగ్గుళ్ళు వస్తున్నాయి. తర్వాత అవి కూలిపోతాయి. ఇది కవిత్వాన్ని ఆస్వాదిస్తూ నేర్చుకునే సంగీత పాఠం. ఒక నూతన రాష్ట్రం లో ఒక వినూత్న ప్రయత్నం. 
ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో వందమంది కవులకు పైగా  పాల్గొన్నారు అందులో ప్రముఖలు, అప్పటికే కవుల్లుగా ఎస్టాబ్లిష్ అయిన వారు ,కొత్త వారు. వీళ్ళందరూ  జుగల్ బంది.

2013 -kavisangamam poetry festival 
ఇవే కాక ఇతర బాషా కవులతో ప్రత్యేక సదస్సులు జరిగాయి. అందులో బెంగాలీ కవి సుభోద్ సర్కార్, ప్రసిద్ద తమిళకవి చేరన్ రుద్రమూర్తి, తమిళ కవయిత్రి సల్మ, కన్నడ కవయిత్రి మమత సాగర్, హిందీ కవయిత్రి రతి సక్సేనా, గుజరాతీ కవి శీతాంశు యసశ్చన్ద్ర  పాల్గొన్నారు. దీని ద్వారా వివిధ బాషలోని కవిత్వ తీరుతెన్నులని వారి అనుభవాలనుండి మనం  స్వయంగా తెలుసుకునే అవకాశం.. ఈ ప్రయోగం కవిత్వంలో చాల అవసరం.  కేవలం చదివి తెలుసుకోవడమే కాక, ఆ కవులతో ముఖాముఖిగా నేర్చుకోవడం. ! ఇది కేవలం విషయ సేకరణకే కాక కవికీ  కవికి మధ్యన స్నేహబంధం ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్స్ లో డిలర్నింగ్, రీలర్నింగ్ కూడ జరుగుతుంది. కవిత్వాన్ని రాజకీయ, సామాజిక, సాంస్కృతికదృష్టితో చూసే అవకాశం ఏర్పడుతుంది. ఇది సంభాషణలలో సంభాషణలు జరిగేందుకు ఏర్పరిచే  ప్రక్రియ. 
సంగమంలో వివిధ కవిత్వ పాయలను కలిపే తీరం.

కవిసంగమంలో 'మీట్ ద పోయెట్' అనే  కార్యక్రమంలో  నారాయణస్వామి వెంకటయోగి, అఫ్సర్,ఈ నెలలో ఎ. కృష్ణారావు[కృష్ణుడు ] గారితో జరగబోతోంది.
 ఈ వేదిక ఒకరితో ఒకరు, కవిత్వానికి సంబంధించిన  అంశాల్ని పదిమందితో పంచుకోవడానికి కవులకి దోహదపడుతుంది. పాల్గోనేవారికి కవి,వాళ్ళ కవిత్వ ప్రస్ధానం ప్రాసెస్స్ ని  కాప్చర్ చేసేందుకు వీలవుతుంది. ఈ ప్రక్రియ పద్ధతిని సామజిక శాస్త్రం పరిశోధనలో ముఖ్యంగా నెరటివ్ రిసర్చ్ లో ప్రయోగిస్తారు. కవిసంగమంలో ఈ ప్రక్రియ ద్వారా సోషియాలజి ఆఫ్ పోయట్రి ని కాప్చర్ చేయచ్చు. దీని వల్ల నేర్చుకునేటప్పుడు మన దృష్టితో కాక ఎదుటి వాళ్ళ దృష్టితో పరిశీలించే అవకాశం ఏర్పడుతుంది.

కవిసంగమంలో  జరుగుతున్న ప్రక్రియల్లో కవిత్వానికి సంబంధించిన  ప్రత్యేక రోజులని జరుపుకోవడం, ప్రపంచ కవితా దినోత్సవం వంటివి జరుగుతున్నాయి., కవిత్వ ఉత్సవాలు 2013డిసెంబర్ 15 న జరిగిన ఉత్సవంలో ముఖ్యఅతిధిగా ప్రసిద్ధ గుజరాతీ కవి ప్రొ.శితాంషు యశస్చంద్ర గారు పాల్గొన్నారు. ఈ నెల డిసెంబర్ 14న   గోల్డెన్ త్రిషోల్డ్ లో జరగబోయే ఉత్సవంలో  ముఖ్య అతిధిగా ప్రముఖ తమిళ కవయత్రి సల్మ పాల్గొంటున్నారు . 

**
ఈ ప్రక్రియ కవిత్వాన్ని పరివ్యాప్తి చేయడానికి జరిగే ఒక మాస్ క్యాంపెయిన్. సోషల్ నెట్ వర్కింగ్ లో ఎక్కువగా ఉపయోగించే సాధనం. ఒక అంతర్జాల సాధనాన్ని జనజీవన స్రవంతిలోకి తెచ్చే ఇంధనం.ఇది అడవిలో నిప్పు పెట్టినట్టు ,ఒకసారి నిప్పు అంటిస్తే ఇక మంటలార్పడం ఎవడి తరం కాదు. సామాజిక అస్తిత్వ పోరాటాలలో  ఈ ప్రక్రియ కీలక పాత్ర వహించింది. ఆ ప్రక్రియ ఇప్పుడు కవిత్వానికి  కొత్త రూపాన్ని అవిష్కరించేదుకు జరుగుతోంది. జీవకవిత్వ నినాదానికి కొనసాగింపు. 
కవిత్వం లో  కవిసంగమం ఒక రినైసెన్స్ సృష్టిస్తోంది. యూరోప్ లో కవిత్వం కొత్తపోకడలు సంతరించుకుంటోంది. కవిత్వాన్న్ని కోరియోగ్రఫ్ చేస్తున్నారు. గతంలో కొద్దిగా మన దేశంలోనూ  జరిగింది.
ఈ ప్రయత్నాలన్నీ కవిత్వాన్ని కేవలం రాయడం ,చదవడం, అన్నదే కాక వినడం , చూడడం కోసం చేసే ప్రక్రియలు . మన రాతలకి జీవం పోయడం. తద్వారా   నిర్జీవమైన మన ప్రాణానికి మనం ప్రాణం పోసుకోవడం. అంతేకాక ప్రసిద్ద తమిళకవి చేరన్ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు,చదివిన కవిత్వం పాల్గొన్న కొందరు కవులు అనువదించి ఆయన కవితలని వేదికపై చదివారు. 
ఇది లర్నింగ్ లో షేరింగ్ ప్రక్రియ. సంగమ దృశ్యం.
**

ఈ మూడేళ్ళకాలంలో కవిసంగమం కొన్ని వందలకొద్ది ఫోటోలు, వీడియోలు, ఆడియోలు పొందుపర్చింది. ఇది కవిత్వం, కవులకు సంబంధించిన  ఆడియో, విజువల్ డేటా. ఇది ప్రాసెస్స్ లర్నింగ్ లో కీలకమైనది ముందుతరాలకు  పొందుపరచిన నిధి. 
ఇది సృష్టించడానికి, పొందుపర్చడానికి కొన్ని లక్షల డబ్బు వెచ్చిస్తారు. ఈ సమాచారాన్ని  కవిసంగమం యు-ట్యూబ్, ఫేస్ బుక్ ద్వారా పరివ్యాప్తి చేస్తోంది. దీనివల్ల కవులకి విశ్వవ్యాప్తిగా గుర్తింపు లభిస్తోంది. ఇది నేర్చుకున్న వాటిని  విస్తరింపచేయడమే కాక, ఇతరుల్ని ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేయడం.
144 కవితలతో 'కవిసంగమం-2012 ' కవితా సంకలనం ప్రచురించింది.. ఇందులో  ఎనభైమందికి పైగానే వర్థమాన కవులు అరంగేట్రం చేసారు. ఇది వాళ్ళకి గొప్ప ప్రేరణ. ఎంతోమంది కొత్త కవులు తమ తొలి కవితా సంపుటి ఆవిష్కరణకు కవిసంగమం 
వేదిక అయ్యింది.
కవిసంగమంలో రోజు వచ్చే వివిధ శీర్షికల్లోని వ్యాసాల్లో కవిత్వసంబధిత  అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి .
బహుశా ఇప్పటి వరకు ఏ  ప్రత్రిక ఇవ్వని శీర్షిక , స్వేఛ్చా కవి/రచయితలకు  ఇక్కడ దొరికింది. వాళ్ళ వ్యాసాల్లోని విశ్లేషణ  అమోఘం. వారి ఓపికకు, కాన్ట్రిబ్యుషన్ కి  జోహార్లు. ఈ ప్రయత్నం కవిత్వానికి ఓ కొత్త ఒరవడిని కల్పించింది. ఈ ప్రక్రియ లర్నింగ్ లో  కొత్తదృష్టిని ఇచ్చేందుకు ,కాలానుసారంగా మానని మనమ సరిచేసుకునేందుకు  దోహద పడుతుంది. ఒక విధంగా మనని మననం క్రాస్ చెక్  చేస్కోవడానికి ఉపయోగపడే మంత్రం.
ఒక అంతర్జాల పుస్తకం వివిధరకాలుగా కవిత్వవేదిక అవ్వడం చాలా అరుదు .మరి ముఖ్యంగా మన దేశంలో. ఇదంతా చూస్తుంటే కవిత్వం ఒక మానవీయ రసాయనిక చర్యలా కనిపిస్తోంది. ఒక వాల్కనో బద్దలై  లావా  ప్రవహిస్తోంది. ఈ ప్రవహం పై నిఖిలేశ్వర్ గారు అన్న మాటలు ‘'మూడుతరాల కవిసంగమం’', విమల గారి మాటల్లో  ‘'ఉత్సవంలా జరుగుతున్న ఇటువంటి కవిత్వ ప్రయత్నంలో కొత్త పూలు వికశించే దృశ్యాన్ని చూస్తున్నాను.'.
 ***
జీవితం టి.వి. సీరియల్లా కొనసాగుతున్నకాలంలో కవిసంగమం ఒక రిలీఫ్ తో కూడుకున్న బ్రేక్ నిచ్చింది. కవిత్యం మీద ఇష్టం లేకపోయినా  కవిసంగమం ప్రతినెల ఏర్పాటుచేసే కవులవేదికలో  పాల్గొంటే' నేటితరానికి  కవిత్వం రాక పోయినా పదిమందితో కల్సి కాలం గడిపే లైఫ్ స్కిల్ అయినా  వస్త్తుంది. అది కవిత్వం రాయకపోయినా కవితలా బతకాలి అన్న లక్షణం నేర్పిస్తుంది. మనం మన ముందుతరాలకి ఇది ఇచ్చివెళితే చాలు. అప్పుడు కవిత్వం తప్పక కవిత్వమే అవుతుంది.

కొత్తవాళ్ళు కవిత్వంలోకి రావడంలేదనే దశనుంచి అనేక కొత్తగళాలతో 'కవిసంగమం'-- 'నువ్వొక పచ్చని చెట్టైతే, పిట్టలు వాటంతటవే వచ్చి వాలేనుఅన్నమాటను నిజం చేసి చూపింది. జీవనది ఒడ్డునున్నజమ్మిచెట్టు కవిసంగమం. రండి,ఆ జమ్మిఆకుల తో అలై బలై పండగ చేస్కుందాం.

[కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్ డిసెంబర్ 14 న హైదరాబాద్ లో జరుపుకుంటున్న సందర్భంగా ]

1 comment:

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...