అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

4 May 2016

జయహో

స్పూర్తి ప్రదాతకు జయహో

నదీ మూలం లాంటి ఇంటి నుంచి నగరానికి చేరి , వర్ధమాన కవులకు పచ్చని చెట్టులా మారిన Kavi Yakoob కు జన్మదిన శుభాకాంక్షలు. 1982 లో ఖమ్మం సిద్దారెడ్డి కాలేజీలో పరిచయమైన నాటి నుంచి నేటి వరకు స్నేహం పంచటమే తప్ప, ఏనాడూ ద్వేషం ఎరుగని బోలాశంకరుడికి ప్రేమ పూర్వక అభినందనలు.
ఇరవై ఏళ్ళ పాటు వ్యాపారంలో తనమునకలై, సాహితీ ప్రపంచానికి దూరమైన నేను జనజీవనం లోకి తిరిగొచ్చాక ప్రేమతో ఆలింగనం చేసుకున్నది కవిసంగమం. యాకుబ్ నెలకొల్పిన ఆ సంస్థ, దాని కార్యక్రమాలు నేను తోపుడుబండి పెట్టడానికి స్పూర్తినిచ్చాయి. తోపుడుబండి తోలినినాదం జయహో కవిత్వం అనేది యాకుబ్ సృష్టే. బండి మొదలైన నాటి నుంచి నేటి వరకు బండికి ఇంధనంగా పనిచేస్తున్నాది నా మిత్రుడే.
ఈరోజు పల్లెకుప్రేమతో ..అంటూ గ్రంధాలయ ఉద్యమం ప్రారంభించడానికి కూడా స్ఫూర్తి యాకూబే. తన సొంత ఊరు, ఒక మారుమూల పల్లె రొట్టమాకురేవు . గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రంధాలయాలు అవసరం అని గుర్తించి సొంత ఖర్చుతో అక్కడ ఒక గ్రంధాలయాన్ని స్థాపించాడు. ఆ కార్యక్రమానికి హాజరైనప్పుడే ఊరూరా గ్రంధాలయాలు పెట్టాలనే ఆలోచనకు బీజం పడింది. ఆ ఆలోచనే పెరిగి పెద్దదై ‘మనవూరు-మన గ్రంధాలయం’ అనే నినాదంగా మారింది. ఈరోజు తెలుగు నేలపై తిరుగుతున్న ‘పల్లెకు ప్రేమతో..తోపుడుబండి’ యాత్రకు నేపధ్యం అదే.

లవ్ యూ రా బాబాయ్.....మరోసారి దిల్ సే జన్మదిన శుభాకాంక్షలు.


~సాదిక్ అలీ 
మార్చి 2,2016 

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...