అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

17 Oct 2011

మా సఖుడు


మ్రొక్కిన కొలది కాలితో 
త్రోక్కివేయు నీ కటిన లోకమెల్ల
బహిష్క్రుతమ్ము రండు చిమ్మతలార !
నా వలెనె పాడుకొను మీరె నాకు సఖులు !
       -జాషువా "గబ్బిలం"నుండి.
జాషువా 116 వ జయంతి ఉత్సవాల సందర్బం గా  తెలుగు అకాడెమీ నిర్వహించిన కవి సమ్మేళనం లో చదివిన కవిత ఇది.కవిత శీర్షిక పైన జాషువా రాసిన పద్యం లోంచి తీసుకున్నాను.


నీ కాలంలో నువ్వు వేసిన అడుగుల్ని 
ఇవాళ మెచ్చుకున్టున్నాం,సభలు చేసి చప్పట్లు కొడుతున్నాం 
నీ జీవితాన్ని చదివి ,తెలుసుకుని
నువ్వు రాసిన అక్షరాల్ని తడుముకుని
నీ ముందు మోకరిల్లుతున్నాం 

ఏటికి ఎదురీదడం, గాలి వీచే వాలుకు
ఎదురుగా నడవడం నీ విజయం.

'గబ్బిలాన్ని'నువ్వొక ప్రతీకగా చెప్పడం
'నాలుగు పడగల హైందవ నాగరాజు'బుసలకు ఎదురొడ్డి నిలవడం 
ఒక్కడివే వందలుగా మారి ముందుకు సాగడం
సాధించి చూపిన నీ విజయాలు.
***
నీ తర్వాత నీలా మేం
అన్ని అగచాట్లు ,ఎదురుదెబ్బలు తినకుండానే
నీవు సాదించిన విజయాల మీద ,
నీవు సాగివచ్చిన గమ్యాలతీరం మీదా నిల్చుని 
ఇవాళ ఇలా మాట్లాడుతున్నాం-

నిన్ను శ్లాగిస్తూ ,నీ అక్షరాల అనుభవాల్ని సంపదను 
పదిలంగా మా కలల్లోకి ఓంపుకుని
విశ్వాస ప్రతీకలుగా ఇలా సగర్వంగా నిల్చున్నాం. 


జాషువా!
నీవు  నిర్మించిన కలలసౌధాన్ని 
నీవు అనుభవించకుండానే వెళ్ళిపోయావు
మేమంతా ఆ కలలసౌధం ముందు
నీ కలల్ని ఇలా పాడుకుంటూ ఉన్నాం 

@

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...