అపుడపుడూ ఎక్కడికైనా వెళ్లి రావడానికి ఒక చోటుండాలి,ఊరుండాలి,కనీసం ఒక్క మనిషైనా మిగిలుండాలి !

21 Jul 2013

అనువాద కవిత

 
టి.పి.రాజీవన్ [మలయాళ కవి]
...................................

ఇసుకరేణువులకు విశేషత ఉంది -

సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తర్వాత 
అవి మనుషుల్లా మారి పోతాయి 
ఏడుస్తాయ్, పోట్లాడుకుంటాయ్, నవ్వుతాయ్,
కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటాయి

చీకటి ముసిరినా , వెలుతురు వచ్చినా
మళ్ళీ ఇసుకరేణువుల్లా మారిపోతుంటాయి
నీలాగా, నాలాగా
కలుసుకునేముందు, విడిపోయే ముందులా !

*ప్రణయ శతకం నుండి.

No comments:

Post a Comment

ఇటు కూడా ఓ లుక్కేయండి

Related Posts Plugin for WordPress, Blogger...